న్యూఢిల్లీ, జూన్ 15: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) నూతన చైర్మన్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న జీఆర్ చింతల ఆగస్టు 1న పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో నూతన వ్యక్తి కోసం కేంద్రం కసరత్తు ఆరంభించింది.
నాబార్డ్ చైర్మన్గా చింతల మే 2020లో నియమితులయ్యారు. ప్రైవేట్ బ్యాంక్లు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూట్లు, వ్యవసాయానికి సంబంధించిన ఆర్గనైజేషన్లు, కో-ఆపరేటివ్-రూరల్ డెవలప్మెంట్ రంగం, బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తులకోసం కసరత్తు చేస్తున్నది.