CCI on Zomato & Swiggy | ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ జొమాటో, స్విగ్గీలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) షాక్ ఇచ్చింది. ఈ సంస్థలు యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీస్లు అవలంభిస్తున్నాయని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించాయి. దీంతో వాటి లావాదేవీలపై సీసీఐ విచారణకు ఆదేశించింది.
ఆర్డర్ మేరకు ఫుడ్ సరఫరా చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లకు చెల్లింపుల్లో జాప్యానికి పాల్పడుతున్నాయని జొమాటో, స్విగ్గీలపై అభియోగం. ఇంకా ఏకపక్ష నిబంధనలు అమలు చేస్తూ, అత్యధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయని సీసీఐ తెలిపింది.
నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) చేసిన ఫిర్యాదుల ఆధారంగా సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 60 రోజుల్లో సీసీఐ డైరెక్టర్ జనరల్ దర్యాప్తు నివేదిక సమర్పించనున్నారు. ఫుడ్ ఆర్డర్ వచ్చిన 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని జొమాటో నిర్ణయించిన నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.