న్యూఢిల్లీ, డిసెంబర్ 31: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సమగ్ర దర్యాప్తునకు శుక్రవారం ఆదేశించింది. యాపిల్ తమ యాప్ స్టోర్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిందన్న ఆరోపణలున్నాయి. దీనిపైనే సీసీఐ విచారణకు ఆదేశించింది. మార్కెట్లో ఇతర సంస్థల ప్రయోజనాలను దెబ్బతీస్తూ తమ ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు యాప్లను యాపిల్ అందిస్తున్నదన్న ఫిర్యాదులు సీసీఐకి వచ్చాయి.