న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయోట, హోండా తదితర సంస్థల కార్లు గత నెలలో విశేషంగా అమ్ముడుపోయాయి. అయితే దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీకి సెమీకండక్టర్ కొరత ఇబ్బందిగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఆ సంస్థ విక్రయాలు గతంతో పోల్చితే క్షీణించాయి.