న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 3 శాతం మేర తగ్గాయని కానలైజ్ రీసెర్చ్ వెల్లడించింది. తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో 4.3 కోట్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే దిగుమతయ్యాయని తెలిపింది. త్రైమాసికం ప్రారంభంలో పలు కంపెనీల వద్ద నిల్వలు అధికంగా ఉన్నాయని, దీంతో దిగుమతులు తగ్గించుకున్నట్టు కానలైజ్ సీనియర్ అనలిస్ట్ సాన్యం చౌరాసియా వివరించారు.
మార్కెట్ రికవరీ సంకేతాలు కన్పిస్తున్నప్పటికీ, టాప్ ఫైవ్ బ్రాండ్స్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయన్నారు. పలు కంపెనీలు పండుగ సీజన్ కోసం స్మార్ట్ఫోన్ బ్రాండ్లను విడుదల చేశాయని, ప్రత్యేకించి బడ్జెట్ ధరగల 5జీ హ్యాండ్సెట్లను ప్రమోట్ చేశాయని చౌరాసియా తెలిపారు.
మార్కెట్ క్రమేపీ 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల పట్ల మళ్లుతున్నదని, షావోమి, రియల్మిలు ఆన్లైన్ అవుట్లెట్స్ ద్వారా చౌక 5జీ డివైజ్లతో అమ్మకాలు పెంచుకున్నాయన్నారు. మరోవైపు శామ్సంగ్ ఎస్23 సిరీస్, ఓల్డ్ జనరేషన్ యాపిల్ ఐఫోన్ల నేతృత్వంలో ప్రీమియం మార్కెట్ వృద్ధి కొనసాగుతున్నదన్నారు. క్యూ3లో స్మార్ట్ఫోన్ మార్కెట్ వివరాలు..