Cairn Energy India | భారత్తో రెట్రోస్పెక్టివ్ టాక్స్ వివాదం పరిష్కారం కావడంతో బ్రిటన్ ఎనర్జీ జెయింట్ కెయిర్న్ తన వాటాదారులకు ఈ ఏడాది 700 మిలియన్ల డాలర్లు స్పెషల్ డివిడెండ్ ఇవ్వనున్నట్లు మంగళవారం ప్రకటించింది. దాంతోపాటు షేర్ల బై బ్యాక్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. 2012 నాటి రెట్రోస్పెక్టివ్ టాక్స్ చట్టంలో కేంద్రం ఇటీవల కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం తమకు 1.06 బిలియన్ల డాలర్ల మనీ రీఫండ్ చేసేందుకు కెయిర్న్ ఎనర్జీ సీఈవో సిమన్ థామ్సన్ చెప్పారు.
ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నదని సిమన్ థామ్సన్ తెలిపారు. వివాదాస్పద రెట్రోస్పెక్టివ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై 120 కోట్ల పై చిలుకు డాలర్లు పరిహారం చెల్లించాలని భారత్ను డచ్ కోర్టు ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియాతోపాటు విదేశాల్లోని భారత్ ఆస్తులను జప్తు చేయాలని పలు దేశాల న్యాయస్థానాల్లో కెయిర్న్ పిటిషన్లు దాఖలు చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్ను వాయిదా వేయండి..!