బ్యాంక్ ఖాతాలు నిలిపివేసిన భారత్
పన్నుల ఎగవేతకు పాల్పడటమే కారణం
న్యూఢిల్లీ, మార్చి 30: చైనా సంస్థ ‘బైట్డ్యాన్స్’కు భారత్లో మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు బైట్డ్యాన్స్పై అభియోగాలు రావడంతో సిటీబ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ఆ సంస్థకు చెందిన ఖాతాలను అధికారులు స్తంభింపజేశారు. దీంతో తమ కార్యకలాపాలకు విఘాతం తీవ్ర కలుగుతుందని బెంబేలెత్తుతున్న బైట్డ్యాన్స్.. అధికారుల ఉత్తర్వును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తున్నది. భారత్-చైనా సరిహద్దు వద్ద సైనిక సంఘర్షణ నేపథ్యంలో బైట్డ్యాన్స్కు చెందిన ప్రముఖ వీడియో యాప్ ‘టిక్ టాక్’పై కేంద్ర ప్రభుత్వం గతేడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ నిషేధాన్ని అలాగే కొనసాగించాలని నరేంద్ర మోదీ సర్కార్ నిర్ణయించడంతో బైట్డ్యాన్స్ భారత్లో తమ సిబ్బంది సంఖ్యను గణనీయంగా తగ్గించింది. అయినా ఇప్పటికీ భారత్లో బైట్డ్యాన్స్ ఉద్యోగులు దాదాపు 1,300 ఉన్నారు. వీరిలో చాలా మంది బైట్డ్యాన్స్ విదేశీ వ్యాపార కార్యకలాపాలకు సేవలు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: