Zomato Layoffs | నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ ‘బైజూ’స్.. ఫోన్ కాల్స్ ద్వారా ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రక్రియ చేపట్టింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు కనీసం నోటీస్ పీరియడ్ లో పని చేసేందుకు కూడా అవకాశం ఇవ్వడంలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తా కథనం ప్రచురితమైంది. గత నెలలో రాహుల్ అనే ఉద్యోగి తన కుటుంబ సభ్యుడి అనారోగ్యంతో ఇంటికెళ్లాడు. మార్చి మధ్యలో ఆఫీసులో సెలవు పెట్టి మరీ వెళ్లాడు. కానీ, గత నెల 31న అకస్మాత్తుగా రాహుల్కు హెచ్ఆర్ విభాగం అధికారులు ఫోన్ చేసి ఉద్యోగం నుంచి తొలగించినట్లు చెప్పారు.
కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగాలేనందు వల్లే టాప్ మేనేజ్మెంట్ కొందరు ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని రాహుల్కు హెచ్ఆర్ అధికారులు తెలిపారు. ఈ దఫా సుమారు 100 నుంచి 500 మంది ఉద్యోగులకు లే-ఆఫ్స్ ప్రకటించిందని తెలుస్తున్నది. 2022 నుంచే బైజూస్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది. గత రెండేండ్లలో కంపెనీ 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ప్రస్తుతం బైజూస్ సంస్థలో 14 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.