న్యూఢిల్లీ, మార్చి 5: చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్తో 650 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. కేవలం 15 నిమిషాల చార్జింగ్తో 200 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్ను తొలుత బుకింగ్ చేసుకున్న కొనుగోలుదారులకు హోమ్ చార్జర్, వ్యారెంటీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ‘సీల్’ ఎలక్ట్రిక్ సెడాన్ పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.41 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..ప్రీమియం వెర్షన్ రూ.45.55 లక్షలు, సెడాన్ రకం రూ.53 లక్షలకు లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఎలక్ట్రానిక్ హైడెన్ ఫ్లష్ డోర్, 15.6 అంగుళాల టచ్స్క్రీన్, ఆటోమేటిక్గా వర్షం సెన్సింగ్ వైప్స్, ఏసీ వెంట్స్ మార్చుకునే విధంగా డిజైన్ చేసింది. అదనపు స్థలం, భద్రత, పనితీరు ఆధారంగా రూపొందించిన మూడో మాడల్ ఇదేనని బీవైడీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. హైదరాబాద్లో బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈవీ ప్లాంట్ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంపై ఆయన స్పందిస్తూ..డిమాండ్ ఏదైతేనేం, మేము ప్రభుత్వ నిబంధనల ప్రకారం దానిని తీర్చడానికి ప్రయత్నిస్తున్నాం,