Vistara CEO : ఎయిర్ ఇండియాలో విస్తారా విమాన సంస్థను విలీనం చేస్తున్నట్టు టాటా కంపెనీ, సింగపూర్ ఎయిర్లైన్స్ ఈ రోజు ప్రకటించాయి. దాంతో, విస్తారా ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ సందర్భంగా విస్తారా సీఈవో వినోద్ కన్నన్ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు సందేశం పంపించాడు. ‘మీ భవిష్యత్ గురించి ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు లేనిపోనివి ఊహించుకోకండి. మీరు ఉద్యోగంలో రాణించడానికి, పై స్థాయికి వెళ్లడానికి మరిన్ని అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయి’ అని సీఈవో వినోద్ కన్నన్ ఈ-మెయిల్లో రాసుకొచ్చారు.
విలీనం ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం ఉందని, అప్పటి వరకు విస్తారా స్వంతంత్రగానే పనిచేస్తుందని ఉద్యోగులకు తెలియజేశాడు. అంతేకాదు తక్కువ కాలంలో ఏ మార్పులు జరగవని, బిజినెస్ అనేది మునపటిలానే జరుగుతుందని వినోదో కన్నన్ తెలిపాడు. 024 మార్చి కల్లా విలీనం ప్రక్రియ పూర్తి కానుంది. విలీనం తర్వాత విస్తారా, ఎయిర్ ఇండియాలో 2059 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విస్తారాను 2013లో ప్రారంభించారు. ఈ కంపెనీ ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. ప్రస్తుతం విస్తారాలో 4,700 మంది పనిచేస్తున్నారు.