న్యూఢిల్లీ, జూన్ 20: ప్రైవేట్ రంగంలో అత్యంత విలువైన సంస్థల జాబితాను బుర్గండీ ప్రైవేట్తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసింది. దేశంలోని టాప్-500 కంపెనీలతో వచ్చిన ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో నిలిచింది. ‘2022 బుర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500’ పేరిట విడుదలైన ఈ ప్రత్యేక రిపోర్టు ప్రకారం ఆర్ఐఎల్ విలువ రూ.16.3 లక్షల కోట్లుగా ఉన్నది. నాడు రూ.17.3 లక్షల కోట్లుగా ఉన్నది.
ఇక ఆర్ఐఎల్ తర్వాతి రెండు స్థానాల్లో వరుసగా టీసీఎస్ (రూ.11.8 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.9.4 లక్షల కోట్లు) ఉన్నాయి. మునుపటి జాబితాలో వీటి విలువ వరుసగా రూ.11.6 లక్షల కోట్లు, రూ.8.3 లక్షల కోట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ లక్ష కోట్ల రూపాయలపైనే ఎగబాకడం విశేషం.