న్యూఢిల్లీ, మార్చి 22: ఆటో కంపోనెంట్స్ తయారీలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరొందిన బాష్ లిమిటెడ్.. తమ ఇండియా విభాగం అధ్యక్షుడిగా, ఎండీగా గురుప్రసాద్ ముడ్లపూర్ను నియమించింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. సౌమిత్రా భట్టాచార్య స్థానంలో ఈ ఏడాది జూలై 1న గురుప్రసాద్ ఈ బాధ్యతల్లోకి రానున్నారు.
బాష్ గ్రూప్లో గురుప్రసాద్కు 15 ఏండ్ల అనుభవం ఉన్నది. కాగా, ప్రస్తుతం బాష్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, బాష్ ఇండియా మొబిలిటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సందీప్ నెలమంగళ.. జూలై 1న బాష్ లిమిటెడ్ జాయింట్ ఎండీగా వస్తారని సంస్థ ఈ సందర్భంగా పేర్కొన్నది.