ముంబై, మే 23: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. రూ.3 కో ట్ల లోపు ఏడాది నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిం ది. దీంతో ఏడాది నుంచి రెండేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటు 6.50 శాతానికి పెంచిన బ్యాంక్.. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీని 6.60 శాతంగాను, అలాగే మూడేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీని 6.70 శాతానికి సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 -0.65 శాతం వడ్డీని చెల్లించనున్నది.