న్యూఢిల్లీ : పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటంతో పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేస్తున్నాయి. తాజాగా బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో రాబోయే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్ వాహనాలను లాంఛ్ చేసేందుకు సన్నద్ధమైంది. ఈ ఏడాది డిసెంబర్ రెండో వారంలో బీఎండబ్ల్యూ iX రానుండగా, మినీ ఎలక్ట్రిక్ను మరో మూడు నెలల తర్వాత బీఎండబ్ల్యూ లాంఛ్ చేస్తోంది.
ఆపై బీఎండబ్ల్యూ i4 సెడాన్ను 2022 ప్రధమార్ధంలో లాంఛ్ చేయనుంది. ఎలక్ట్రిక్ కార్లతో హోరెత్తిస్తున్న బీఎండబ్ల్యూ అందుకు సన్నాహంగా దేశవ్యాప్తంగా 35 నగరాల్లోని తన డీలర్ల వద్ద 50కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్చార్జర్లను ఇన్స్టాల్ చేస్తోంది.