న్యూఢిల్లీ : నవతరం సాంకేతికతో అత్యాధునిక ఫీచర్లతో బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఐఎక్స్ను లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ ఐఎక్స్లో ఉండే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు వాహనంలో నాలుగు వీల్స్కు పవర్ను సప్లయి చేసేలా డిజైన్ చేశారు. భారత్లో కొద్దికాలం కిందట ఐ రేంజ్ బార్న్ ఎలక్ట్రిక్ కార్లను లాంఛ్ చేసిన బీఎండబ్ల్యూ ఐ8నూ లాంఛ్ చేసింది. ఇక దేశీ మార్కెట్లో ఐ4 ఎలక్ట్రిక్ సెడాన్తో పాటు ఐఎక్స్ ఎస్యూవీతో ఎలక్ర్టిక్ వాహనాలను లాంఛ్ చేయనుంది. బీఎండబ్ల్యూలో ఇంతకుముందెన్నడూ లేని రీతిలో ఐఎక్స్ ఎస్యూవీలో ఫుల్ ఎల్ఈడీ హెడ్లైట్ సిస్టంను వాడుతున్నారు.
ఐఎక్స్ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో బీఎండబ్ల్యూ తొలిసారిగా న్యూ కాన్సెప్ట్ షైటెక్ను పరిచయం చేస్తోంది. వెహికల్ స్మూత్, స్టైలిష్ లుక్ కోసం క్యారెక్టర్ లైన్స్ను తగ్గించారు. స్ట్పోర్టీ లుక్ కోసం పిల్లర్ లెస్ డోర్స్, విండోస్తో పాటు ఐఎక్స్ వెనుకభాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్స్, హ్యాండ్సమ్ టెయిల్ గేట్తో స్మార్ట్ లుక్ను తీసుకువచ్చారు. ఐఎక్స్ ఎస్యూవీని ఏరోడైనమిక్ డిజైన్తో కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఇంటీరియర్స్ సైతం ఆకట్టుకునేలా మలిచారు. ఐఎక్స్ ఎస్యూవీ లోపల విశాలమైన స్పేస్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్యాష్బోర్డ్లో ఉపయోగించే బటన్లను తగ్గించడం ద్వారా న్యూ లుక్ ఇచ్చేందుకు బీఎండబ్ల్యూ ప్రయత్నించింది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ ధర దాదాపు రూ. 1.16 కోట్లుగా కంపెనీ వెల్లడించింది. బీఎండబ్ల్యూ ఐఎక్స్ మినరల్ వైట్, పైటానిక్ బ్లూ, బ్లాక్ సఫైర్, గ్రే కలర్స్లో అందుబాటులో ఉంటుంది.