న్యూఢిల్లీ : భారత్లో బీఎండబ్ల్యూ 5 సిరీస్ కార్బన్ ఎడిషన్ను బీఎండబ్ల్యూ ఇండియా లాంఛ్ చేసింది. బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్లో తయారయ్యే ఈ కారు రూ 66.30 లక్షలకు అందుబాటులో ఉంటుంది. బీఎండబ్ల్యూ 5 సిరీస్ భారత్లో అత్యంత విజయవంతమైన ప్రీమియం ఎగ్జిక్యూటివ్ సెడాన్స్లో ఒకటని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా పేర్కొన్నారు.
పవర్, ప్లే వంటి విభాగాల్లో మెరుగైన సామర్ధ్యంతో ఈ టైమ్లెస్ మెషీన్ కస్టమర్లను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తోందని చెప్పారు. బీఎండబ్ల్యూ 5 సిరీస్ న్యూ కార్బన్ ఎడిషన్తో మరోసారి కస్టమర్లలో ఉత్సుకత రేపుతోందని అన్నారు. ఎం స్పోర్ట్ ప్యాకేజ్తో కార్బన్ ఎడిషన్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.