హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): టీ హబ్, ఐడియా ల్యాబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం కార్యక్రమాన్ని ఈ నెల 21న నిర్వహిస్తున్నారు. టీ హబ్లో జరగనున్న ఈ కార్యక్రమానికి బ్లాక్ టెక్నాలజీ చెందిన నిపుణులు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి డీసీబీ బ్యాంక్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ప్రసన్న, వర టెక్నాలజీస్ చీఫ్ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ కల్నల్ ఇంద్రజిత్ సింగ్, బ్లాక్చెయిన్ అండ్ ఎమర్జింగ్ టెక్ ఎవాంజిలిస్ట్ శరత్ చంద్ర, సెక్యూర్ క్లౌడ్ టెక్నాలజీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొంటున్నారు.