న్యూఢిల్లీ: బిట్ కాయిన్తో సహా వివిధ క్రిప్టో కరెన్సీల పతనం వెనుక డ్రాగన్.. అమెరికా ఉన్నాయని తెలుస్తున్నది. గత వారం బిట్ కాయిన్ విలువ 8 శాతం పతనమైతే.. మొత్తం క్రిప్టో కరెన్సీలు 30 శాతం డౌన్ అయ్యాయి.
దీని వెనుక బిట్ కాయిన్ సహా క్రిప్టో కరెన్సీల మైనింగ్-ట్రేడింగ్పై చైనా పూర్తి నిషేధం విధించడం ఒక కారణం. మరో అగ్రరాజ్యం అమెరికా రెగ్యులేటర్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ).. బిట్ కాయిన్ ఈటీఎఫ్ల జారీలో జాప్యం చేయడం మరో కారణం.
క్రిప్టో మేజర్ బిట్ కాయిన్ విలువ శుక్రవారం రాత్రి 31,900 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.
మిగతా క్రిప్టో కరెన్సీలు ఏడు శాతం పతనమయ్యాయి. ఈ వారంలో అవి 30 శాతం వరకు పడిపోయాయి.
క్రిప్టోల్లో రెండో స్థానంలో ఉన్న ఎథీరియం విలువ ఈ రోజు 6.83 శాతం తగ్గి 1,830 డాలర్లకు, బినాన్స్ కాయిన్ 5.05 శాతం, కార్డానో విలువ 5.49, డోజ్ కాయిన్ 7.78 శాతం పతనం అయ్యాయి.
ఈవారంలో ఎథీరియం విలువ 18 శాతం, బినాన్స్ కాయిన్ 15 శాతం, కార్డానో, డోజ్ కాయిన్ల విలువ 11 శాతం పడిపోయింది.
గత ఏప్రిల్లో ఆల్టైం రికార్డుతో 64 వేల పై చిలుకు డాలర్లు పలికిన బిట్ కాయిన్.. నాటి నుంచి సగానికి పతనమైంది.
బిట్ కాయిన్ మైనింగ్ను నియంత్రిస్తామని చైనా నియంత్రణ సంస్థలు పేర్కొనడంతో క్రిప్టో కరెన్సీల విలువ పడిపోయింది. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్.
చైనాలో సగం బిట్ కాయిన్లు ఉత్పత్తి అవుతాయి. సిచువాన్లోని క్రిప్టో మైనింగ్ సెంటర్ను మూసేయాలని అధికారులు ఆదేశించారు.
సొంతంగా డిజిటల్ యువాన్ను చలామణిలోకి తీసుకొచ్చేందుకు చైనా యోచిస్తున్నట్లు సమాచారం.
భారీగా పతనమైనా బిట్ కాయిన్ వచ్చే ఆగస్టులో వ్రుద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నారు.
బిట్ కాయిన్ విలువ రెండు నెలల్లో 47 వేల డాలర్ల పై చిలుకు ట్రేడ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబర్లో స్వల్పంగా పడిపోయినా.. అక్టోబర్ నాటికి 63 డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు.
నవంబర్ నాటికి 98 వేల డాలర్లకు.. ఈ ఏడాది చివరికల్లా 1.35 లక్షల డాలర్లకు చేరుతుందని విశ్లేషకులు తెలిపారు.
గతవారం క్రిప్టో కరెన్సీలు భారీగా పతనం కావడానికి అమెరికా రెగ్యులేటర్.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కారణమని తెలుస్తున్నది.
బిట్ కాయిన్ ఈటీఎఫ్లను ఆమోదించడంలో ఎస్ఈసీ జాప్యం చేస్తున్నది. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని భావిస్తున్నారు.
బిట్ కాయిన్ ఈటీఎఫ్ల జారీపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నట్లు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది.
ఆ అభిప్రాయాలను పూర్తిగా క్రోడీకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. ఇలా జాప్యం చేయడం పలు సార్లు జరిగింది.
ప్రస్తుతం వరల్డ్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 125 లక్షల కోట్ల రూపాయలు.. కేవలం బిట్ కాయిన్ ఎం-క్యాప్ రూ.50.57 లక్షల కోట్లు.
భారత దేశంలో 12-14 క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలు బిజినెస్ చేస్తున్నాయి. దేశంలో 1.20 కోట్ల మంది క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారు.