న్యూయార్క్ : స్నాతకోత్సవానికి విచ్చేసిన అతిధులెవరైనా విద్యార్ధులకు పట్టాలు ప్రదానం చేసి నాలుగు మంచి మాటలు చెప్పి బయటపడతారు. అయితే అమెరికన్ బిలియనీర్ (US Billionaire) 2500 మంది విద్యార్ధులకు ఒక్కొక్కరికి వేయి డాలర్ల చొప్పున నగదు అందించి ఆశ్చర్యానికి గురిచేశారు. బోస్టన్లోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ గ్రాడ్యుయేట్లకు స్పీకర్గా విచ్చేసిన బిలియనీర్ రాబర్ట్ హేల్ ప్రతి ఒక్క విద్యార్ధికి రూ వేయి డాలర్లతో కూడిన కవర్లను ఇస్తానని ప్రకటించారు.
వేదికపైనే వారికి 500 డాలర్లతో కూడిన రెండేసి కవర్లను రాబర్ట్ హేల్ అందచేశారు. వీటిలో 500 డాలర్లు బహుమతి కాగా మరో 500 డాలర్లను ఏ అవసరం కలిగిన ఏ వ్యక్తి లేదా సంస్ధకు అందించాలని కోరారు. సంక్లిష్ట సందర్భంలో మీరు ఎదిగివచ్చారని, అందుకు మీరు వేడుక చేసుకోవాల్సిన అవసంర ఉంది..మీ విజయాన్ని మేమంతా సెలబ్రేట్ చేసుకుంటాము..మిమ్నల్ని చూసి గర్వంగా ఫీలవుతున్నాం..అని హేల్ చెప్పుకొచ్చారు.
మీకు మేం రెండు బహుమతులను అందిస్తాం.. అందులో ఒకటి మీకైతే మరొకటి మీరు ఇంకొకరికి గిఫ్ట్గా ఇచ్చేదని బిలియనీర్ సభా వేదికపై ప్రకటించారు. బిలియనీర్ ప్రకటనను విద్యార్ధులు చప్పట్లతో స్వాగతించారు. సమాజంలో తర్వాతి తరాన్ని మీరే నిర్ధారిస్తారని, మీరు పొందినదేదైనా తిరిగి ఇస్తే ఎంతో ఆస్వాదిస్తారని, వైఫల్యాలపై భయపడకుండా పురోగమించాలని కోరారు. కాగా ఆయన గతంలోనూ రాక్స్బరీ కమ్యూనిటీ కాలేజ్ స్నాతకోత్సవంలోనూ 130 మంది గ్రాడ్యుయేట్స్కు ఒక్కొక్కరికి వేయి డాలర్లు గిఫ్ట్గా అందచేశాడు.
Read More
టీసీఎస్లో 40 వేల ఫ్రెషర్ ఉద్యోగాలు