హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని యునైటెడ్ స్టేట్స్ కాన్సులర్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ అలయెన్స్, స్ట్రెంథనింగ్ ఎకనామిక్స్ బ్రిడ్జెస్’ అనే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారత్, అమెరికాల మధ్య ఉ న్న బలమైన సంబంధాలు ఏ దేశానికీ లేవని, 2001 నుండి 2023 వరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం 200 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఐదేండ్లలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.