న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ప్రభుత్వరంగ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో రూ.55 కోట్లు చెల్లించింది.
ఇందుకు సంబంధించి చెక్ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామికి భెల్ సీఎండీ కే సదాశివ్ మూర్తి బుధవారం అందచేశారు. 2023-4 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.87 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపింది.