న్యూఢిల్లీ, మార్చి 5: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్).. ఎన్టీపీసీ నిర్మించతలపెట్టిన 1,600 మెగావాట్ల సింగ్రౌలీ థర్మల్ పవర్ ప్రాజెక్టు(స్టేజ్-2) ఆర్డర్ లభించినట్లు తెలిపింది. ఈ ఆర్డర్ విలువ రూ.9,500 కోట్ల స్థాయిలో ఉంటుందని తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని సోనేభద్ర జిల్లాలో సింగ్రౌలీ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశలో భాగంగా 1,600 మెగావాట్లు (2*800 మెగావాట్లు) విద్యుత్ ప్లాంట్ను నెలకొల్పబోతున్నది.