న్యూఢిల్లీ: దేశంలోని టెలికం ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్కు గట్టి షాక్ తగిలింది. గత మే నెలలో భారతీ ఎయిర్టెల్తోపాటు వొడాఫోన్ ఐడియా భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోయాయి.
టెలికం సెన్సేషన్ రిలయన్స్ జియో మాత్రం గత మే నెలలో 35.5 లక్షల సబ్స్క్రైబర్లను జత చేసుకున్నది. మరోవైపు భారతీ ఎయిర్ టెల్ 43.16 లక్షల యూజర్లను కోల్పోయింది. గతేడాది జూన్ తర్వాత ఎయిర్ టెల్ ఇంత భారీ సంఖ్యలో సబ్స్క్రైబర్లను కోల్పోవడం ఇదే తొలిసారి.
మరో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా సైతం 42.8 లక్షల ఖాతాదారులను కోల్పోయింది. ఇటీవలే ఎయిర్టెల్ తన ప్రీఫెయిడ్ ప్లాన్లను సవరించింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ల ధరలను ఈ నెల 28 నుంచి పెంచి వేసింది.
రూ.49తో మొదలయ్యే ప్రీ పెయిడ్ ప్లాన్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఇక నుంచి ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ ప్లాన్ రూ.79 నుంచి మొదలవుతుంది. దీని ప్రకారం ఎయిర్టెల్ బేసిక్ ప్లాన్ ధర 60 శాతం పెరిగింది.