ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 466 పాయింట్లు లాభపడి 63,384 వద్ద ముగియగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) 137 పాయింట్ల లాభంతో 18,826 వద్ద ముగిసింది. ఇవాళ్టి ట్రేడింగ్ ప్రారంభం నుంచి మార్కెట్లలో పాజిటివ్ ట్రెండే కనిపించింది.
ఇవాళ్టి ట్రేడింగ్లో హెచ్డీఎఫ్సీ లైఫ్ (HDFC Life), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ (SBI Life Insurance), బజాజ్ ఫిన్సర్వ్ (Bajaj Finserv), డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (Dr Reddy’s Laboratories), టైటాన్ కంపెనీ (Titan company) సూచీలు లాభాలు మూటగట్టుకుని టాప్ గెయినర్స్గా నిలిచాయి. అదే సమయంలో విప్రో (Wipro), బజాజ్ ఆటో (Bajaj Auto), టీసీఎస్ (TCS), బీపీసీఎల్ (BPCL), ఓఎన్జీసీ (ONGC) సూచీలు టాప్ లూజర్స్గా ఉన్నాయి.