RBI | న్యూఢిల్లీ, మార్చి 28: ఈ ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు తెరుచుకునే ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరి రోజు కావడంతో ప్రభుత్వ లావాదేవీలకు, ఇతరత్రా చెల్లింపులకు, ట్యాక్స్ పేయర్స్కు ఆటంకం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు 33బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఎస్బీఐసహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐసహా 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకైన డీబీఎస్ బ్యాంక్ ఇండియా ఆదివారం (మార్చి 31) అయినప్పటికీ సాధారణంగానే పనిచేయనున్నాయి. నెఫ్ట్, ఆర్టీజీఎస్తోపాటు చెక్ క్లియరెన్సులు తదితర సేవలు యథాతథంగా సాగుతాయి.