న్యూఢిల్లీ, నవంబర్ 21: దేశంలోని బ్యాంక్లు గత ఐదేండ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిల్ని (ఎన్పీఏలు) రద్దుచేశాయి. ఈ రైటాఫ్తో బ్యాంక్లు వాటి వద్దనున్న ఎన్పీఏలను సగానికి తగ్గించుకోగలిగాయి. సమాచార హక్కు చట్టం కింద ఇండియన్ ఎక్స్ప్రెస్ కోరిన మేరకు రిజర్వ్బ్యాంక్ స్పందిస్తూ ఐదేండ్లలో బ్యాంక్లు రూ.10,09,510 కోట్ల మొండి రుణాల్ని రద్దుచేసినట్టు తెలిపింది. ఈ కాలంలో రైటాఫ్ చేసిన రుణాల్లో బ్యాంక్లు రూ.1.32 లక్షల కోట్లు మాత్రమే రికవరీ చేసుకోగలిగాయన్నది. రైటాఫ్ అయిన రుణాల్లో అత్యధికంగా రూ.7,34,738 కోట్లు (70 శాతం) ప్రభుత్వ రంగ బ్యాంక్లు చేసినవే. రద్దయిన ఎన్పీఏలకు కారణమైన రుణగ్రస్తుల పేర్లను మాత్రం రిజర్వ్బ్యాంక్ వెల్లడించలేదు.