న్యూఢిల్లీ, మే 6: బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు రెండింతలు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.1,350 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.606 కోట్లతో పోలిస్తే 123 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది.
నికర వడ్డీ ఆదాయం 37.77 శాతం పెరిగి రూ.5,493 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.66 శాతం నుంచి 7.31 శాతానికి తగ్గించుకున్న బ్యాంక్..నికర ఎన్పీఏ 1.61 శాతం నుంచి 1.66 శాతానికి పెరిగాయి.