న్యూఢిల్లీ, జనవరి 17: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్లో రూ. 1,151 కోట్ల లాభాన్ని గడించింది. 2021లో రూ.1,027 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 12 శాతం అధికం. రూ.11, 211.14 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం.. 2022-23 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.14,159. 60 కోట్లకు చేరుకున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 64 శాతం ఎగబాకి రూ. 3,408 కోట్ల నుంచి రూ.5,596 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.2,096 కోట్ల నుంచి రూ.3,652 కోట్లకు ఎగబాకింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.66 శాతానికి తగ్గగా.. నికర ఎన్పీఏ 1.61 శాతానికి దిగొచ్చింది.