న్యూఢిల్లీ : బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా సైంటిస్టులు, డేట ఇంజనీర్లను ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్లుగా రిక్రూట్ చేసుకుంటోంది. బ్యాంకు అధికారిక వెబ్సైట్లో ఆసక్తికలిగిన అభ్యర్ధులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులు డిసెంబర్ 6లోగా తమ దరఖాస్తులు పంపాలి. మొత్తం 15 పోస్టులను బ్యాంక్ ఆఫ్ బరోడా భర్తీ చేస్తుంది.
బీటెక్, బీఈల్లో అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులను సాధించి ఉండాలి. ఇక డేటా సైంటిస్టు పోస్టుకు అనుభవం కలిగిన ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపుకలిగిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్సైన్స్, ఐటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని బ్యాంకు పేర్కొంది. ఎంపికైన అభ్యర్ధులకు ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని తెలిపింది.