న్యూఢిల్లీ, జూలై 11: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన రుణాలపై మాత్రమే వడ్డీరేట్లను సవరించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 7.50 శాతం నుంచి 7.65 శాతానికి చేరుకున్నది. అలాగే మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో ఎంసీఎల్ఆర్ 7.35 శాతం, 7.45 శాతానికి చేరుకున్నాయి. కానీ, ఒక్కరోజు, నెల రుణాలపై వడ్డీరేటును యథాతథంగా ఉంచింది.