హైదరాబాద్, జూలై 19: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. హైదరాబాద్లో జరిగిన వినియోగదారుల సమావేశం(కస్టమర్స్ మీట్) కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బ్యాంక్ హైదరాబాద్ జోనల్ హెడ్ మన్ మోహన్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారులకు మెరుగైన సేవలనందిస్తూ, అన్ని రంగాల వ్యాపార వర్గాల అభ్యున్నతిలో భాగస్వామిగా నిలిచేందుకు బ్యాంక్ ఎప్పుడు ముందుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంక్కు దేశవ్యాప్తంగా 8,500 శాఖలు, 11 వేలకు పైగా ఏటీఎంలు ఉన్నాయి.