న్యూఢిల్లీ, ఆగస్టు 20: బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా భారీ స్థాయిలో రుణాలను రైటాఫ్ చేసింది. గడిచిన ఆరేండ్లకాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తన ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. రూ.100 కోట్లకు పైగా రుణాలను తీసుకొని ఎగ్గొట్టిన వారీ ఖాతాలను 2020-21 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ.35,715 కోట్ల రుణాలను రైటాఫ్ చేసింది. ఈ రైటాఫ్ చేసిన రుణాల్లో 28 శాతానికి సమానమైన రూ.9,946 కోట్ల రుణాలను రికవరి చేయడం విశేషం. అయితే, ఆర్టీఐ చట్టం కింద మినహాయింపులను ఉటంకిస్తూ, సాంకేతికంగా రద్దు చేయబడిన ఖాతాలు పరిష్కరించబడిన పెద్ద రుణగ్రహీతల పేర్లను వెల్లడించడానికి బీవోబీ మరోసారి నిరాకరించింది. వీటిలో 2020-21లో అత్యధికంగా రూ.11,916 కోట్ల రుణాలను రైటాఫ్ చేసిన బ్యాంక్.. 2021-22లో రూ.11,261 కోట్లను ఖాతాల నుంచి తొలగించినట్టు ఆర్టీఐ ప్రశ్నకు బీవోబీ వెల్లడించింది.