హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. వివిధ రకాలైన ఉత్పత్తులు తయారు చేసి తమ కంపెనీ బ్రాండ్తో విక్రయించి ప్రజలను మోసాలకు గురి చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రెస్టీజ్ సంస్థ చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా విజయవాడకు చెందిన స్పీడ్ సర్చ్ అండ్ సెక్యూరిటీ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నకిలీలను గుర్తించేందుకు పవర్ అప్ అటర్నీ ఇచ్చారు. ఆ సంస్థ ప్రెస్టీజ్ పేరుతో మార్కెట్లో ఎక్కడ విక్రయాలు సాగుతున్నాయనే దానిపై నిఘా పెట్టారు. బాలానగర్లోని నవజీవన కాలనీలో బెథేల్ ఇండస్ట్రీస్ నిర్వాహకుడు వీకే నర్సింహరావు, తాను తయారు చేస్తున్న ఫ్యాన్లకు ప్రెస్టీజ్ కంపెనీ స్టిక్కర్ వేసి విక్రయాలు సాగిస్తుండడాన్ని గుర్తించి బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సంస్థ నిర్వాహకుడు వినోద్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థపై దాడిచేసి 47 నకిలీ ఫ్యాన్లు, 350 ఫ్యాన్ పైపులు, 400 ప్యాన్ క్యాప్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.