హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న ఆజా ఇంజినీరింగ్ లిమిటెడ్..ఐపీవోకి రాబోతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. రూ.740 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సెబీకి డ్రాఫ్ట్ పేపర్ను సమర్పించింది. దీంట్లో తాజా షేర్లను జారీచేయడంతో రూ.240 కోట్ల వరకు, అలాగే ప్రమోటర్టు, పెట్టుబడిదారుల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించడం ద్వారా మరో రూ.500 కోట్లను సేకరించాలనుకుంటున్నది.
ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్న ఈక్విటీ షేర్లతో ప్రమోటర్ రాకేశ్ చోప్డార్కు రూ.170 కోట్ల నిధులు సమకూరనుండగా..అలాగే పిరమల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ ఆపర్చన్యూటిస్ ఫండ్కు రూ.280 కోట్లు, డీఎంఐ ఫైనాన్స్కు రూ.50 కోట్లు రానున్నాయి. ప్రస్తుతం సంస్థ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, కాంప్లెక్స్, క్షిపణులు, లైఫ్-క్రిటికల్ విడిభాగాలను హైదరాబాద్లో ఉన్న యూనిట్లోనే సంస్థ తయారు చేస్తున్నది. 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.124 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం..గడిచిన ఏడాదికిగాను రూ.251.7 కోట్లకు చేరుకున్నది.