హైదరాబాద్, జూన్ 17: యాక్సిస్ బ్యాంక్..బిట్స్ పిలానీతో జట్టుకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో ఇన్నోవేషన్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నారు. బ్యాంక్ అందించే రూ.100 కోట్ల సీఎస్ఆర్ నిధుల గ్రాంట్తో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నది.
పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, సరికొత్త ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సమగ్ర నివేదికను ఏర్పాటు చేయడంతో దేశంలో డీప్టెక్, ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడానికి దోహదపడనున్నదని పేర్కొంది. అలాగే లైఫ్సెన్స్, బయోఫార్మా, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరికరాలు వంటి రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే ఈ ఇన్నోవేషన్ పార్క్.. సామన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో కూడిన వైద్య పరిష్కారాలను అందించే లక్ష్యంతో పనిచేయనున్నది. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.