హైదరాబాద్, జూన్ 6: కో-వర్కింగ్ సేవల సంస్థ ఔఫిస్..హైదరాబాద్లో తాజా గా మరో సెంటర్ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. నూజివీడు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి నగరంతోపాటు బెంగళూరులో ఈ సెంటర్లను నెలకొల్పబోతున్నట్టు తెలిపింది.
ఆఫీస్ స్థలానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా మరో రెండు సెంటర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ప్రస్తుతం ఔఫిస్కు బెంగళూరులో 23, హైదరాబాద్లో 14 సెంటర్లు ఉన్నాయి.