Homes | గిరాకీకి తోడు ఇన్పుట్ ఖర్చులు పెరిగిపోవడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇండ్ల ధరలు సగటున ఐదు శాతం పెరిగాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల పరిధిలో ఇండ్ల ధరలు చదరపు అడుగుకు గతేడాది డిసెంబర్లో రూ.6,300-6500 పలికితే. ఇప్పుడు రూ.6,660-6800లకు చేరాయి. గుర్గ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల పరిధిలో ఇండ్లు అధిక రేట్లు పలుకుతున్నాయి. పుణెలో గరిష్టంగా రూ.5100-5300 నుంచి గత సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.5500-5700లకు పెరిగాయని ప్రాప్ టైగర్డాట్కాం రియాల్టీ ఇన్సైట్ నివేదిక తేల్చింది.
చెన్నై నగరంలో అతి తక్కువగా రెండు శాతం ధరలు మాత్రమే తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది చదరపు అడుగుకు రూ.5400-5600 నుంచి రూ.5500-5700 వరకు పెరిగాయి. బెంగళూరులో ఆరు శాతం ధరలు ఎక్కువయ్యాయి. రూ.5900-6100 మధ్య నమదవుతున్నాయి.
దేశ రాజధానిలో ఐదు శాతం ధరలు పెరిగాయి. ఢిల్లీలో చదరపు అడుగుకు రూ.4400-4600 నుంచి రూ.4700-4900 వరకు పెరిగాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో మూడు శాతం ధరలు.. రూ.4400 నుంచి రూ.4600 వరకు ఎక్కువయ్యాయి.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఇండ్ల కొనుగోళ్లు మూడు శాతం పిరం అయ్యాయి. చదరపు అడుగు రూ.9900 నుంచి రూ.10100 మధ్య పలుకుతున్నాయి. ధరల పెరుగుదలకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే కారణం అని ప్రాప్ టైగర్ డాట్ కామ్ చెబుతున్నది. 58 శాతం మంది ఇండ్ల కొనుగోలు దారులు పూర్తిగా జీవనానికి సిద్ధమైన ఇండ్ల కొనుగోళ్లకే మొగ్గుతున్నారు.