హైదరాబాద్, అక్టోబర్ 18: ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్)..రాష్ట్రంలో మరో సర్వీసు సెంటర్ను ప్రారంభించింది.
మంచిర్యాలలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో అశోక్ లేలాండ్కు చెందిన అన్ని రకాల వాహనాలకు సర్వీసింగ్ చేయనున్నట్టు ఏఎంపీఎల్ ఈడీ రాజీవ్ సంఘ్వీ తెలిపారు. ఈ రీజియన్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద కమర్షియల్ వాహన సర్వీస్ సెంటర్ ఇదే.