న్యూఢిల్లీ, మే 21 : ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.920.84 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.902.83 కోట్ల లాభంతో పోలిస్తే 2 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,853.34 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ నిర్వహణ ఖర్చులు రూ.7,677.34 కోట్లకు చేరుకున్నాయి.