న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం భారం పెరగనుంది. నెలవారీ ఉచిత లావాదేవీలను మించి ఏటీఎం ద్వారా చేసే విత్డ్రాపై ఛార్జీలను పెంచేందుకు బ్యాంకుల్ని ఆర్బీఐ అనుమతించింది. ఈ మేరకు 2022 జనవరి 1 నుంచి ఒక్కో అదనపు లావాదేవీపై రూ.21 ఛార్జీ+జీఎస్టీని బ్యాంక్లు వసూలు చేస్తాయి. ప్రస్తుతం ఈ ఛార్జీ 20 రూపాయిలు. అయితే ఇకమీదట కూడా ప్రతీ నెలలోనూ ఖాతాదారులు వారి సొంత బ్యాంక్ ఏటీఎంల ద్వారా ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. ఇతర బ్యాంక్ల ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో 3 లావాదేవీలను, నాన్-మెట్రో నగరాల్లో ఐదింటిని ఉచితంగా అనుమతిస్తారు. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణా వ్యయాలు పెరిగినందున ఛార్జీల పెంపు అనివార్యమయ్యిందని ఆర్బీఐ ఇటీవల జారీచేసిన సర్క్యులర్లో పేర్కొంది.