కోల్కతా, జూన్ 3: ప్రభుత్వరంగ సంస్థ యూకో బ్యాంక్ నూతన ఎండీ, సీఈవోగా అశ్వని కుమార్ నియమితులయ్యారు. ఈ నియామకం ఈ నెల ఒకటి నుంచే అమలులోకి వచ్చింది. గతంలో ఆయన ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు.
యూకో బ్యాంక్ ఎండీ, సీఈవోగా పనిచేసిన ఎస్ఎస్ ప్రసాద్ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రసాద్ స్థానాన్ని కుమార్ భర్తి చేయనున్నారు. గతంలో కుమార్..బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకుల్లో పలు హోదాల్లో పనిచేశారు.