Mega Housing Project : టెక్ దిగ్గజం యాపిల్ ఉద్యోగుల సంక్షేమం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తన ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం యాపిల్ ఏకంగా 78,000కు పైగా ఇండ్లను నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టింది. అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంట్ కలిగిన తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా ఇండ్ల నిర్మాణం చేపట్టనుంది. మహిళా ఉద్యోగులు సహా ఉద్యోగులందరికీ మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో యాపిల్ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గత రెండున్నరేండ్లుగా భారత్లో 150000పైగా ప్రత్యక్ష ఉద్యోగాలతో పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలను యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆపై ఉద్యోగుల సంక్షేమం, భద్రత, మెరుగైన నివాసం కల్పించేందుకు వారికి నివాస సదుపాయాలను కల్పించడంపై ప్రస్తుతం టెక్ దిగ్గజం దృష్టి సారించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంంతో ఉద్యోగులకు ఇండ్ల నిర్మాణం చేపట్టనుంది. ప్రైవేట్ రంగంలో ఈ తరహా అతిపెద్ద హౌసింగ్ కార్యక్రమం ఇదేనని చెబుతున్నారు.
అతిపెద్ద యాపిల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కొలువుతీరిన తమిళనాడులోనే 58000 గృహాలు నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్కు తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి, టాటా గ్రూప్, ఎస్పీఆర్ ఇండియా వంటి పలు గ్రూపులు సాయం అందించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయ్యేలా నిధులను వెచ్చించనున్నారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు పారిశ్రామిక దిగ్గజాలు సహకరిస్తున్నాయి. 2025, మార్చి 31 నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
Read More :