న్యూఢిల్లీ : భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్ ఆకర్షణీయంగా ఉండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పలు సంస్ధలు ఈ సెగ్మెంట్లో ఎంట్రీ ఇస్తున్నాయి. గూగుల్ పే, పేటీఎం సహా ఇతర పేమెంట్ యాప్స్కు ఆదరణ లభిస్తుండటంతో తాజాగా భారత్లో యాపిల్ పే (Apple Pay) గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
దేశీ మార్కెట్లో డిజిటల్ పేమెంట్స్ యాప్ను లాంఛ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)తో టెక్ దిగ్గజం సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ దిశంగా ప్రాధమిక చర్చలు జరిగాయని, ఇక పేమెంట్ యాప్ ప్రారంభించే దిశగా యాపిల్ కసరత్తు సాగిస్తున్నట్టు తెలిసింది. యాపిల్కు కీలక మార్కెట్గా ఎదిగిన భారత్లో దేశీ కస్టమర్ల కోసం యాపిల్ పేను ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది.
ఈ సర్వీసు అందుబాటులోకి వస్తే ఇతర పేమెంట్ యాప్స్ తరహాలో ఐఫోన్ యూజర్లు క్యూఆర్ కోడ్స్ను స్కాన్ చేయడం ద్వారా యూపీఐ లావాదేవీలను చేసే వెసులుబాటు కలుగుతుంంది. భారత్లో యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్ వ్యవస్ధ బలోపేతం కావడంతో పెద్దసంఖ్యలో డిజిటల్ లావాదేవీలు సాగుతున్నాయి.
Read More :
ChatGPT | చాట్జీపీటీ యూజర్ల డేటా హ్యాక్.. గురి ఇండియన్స్పైనే.. తేల్చేసిన రీసెర్చ్ సంస్థ