న్యూయార్క్ : ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చేఏడాది జనవరి నుంచి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని టెక్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జనవరి 22 నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీ కోరగా తాజాగా దీన్ని ఫిబ్రవరి 1కి పొడిగించారు. నూతన పని వివరాలు, విధివిధానాలను వెల్లడిస్తూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం చేరవేశారు.
ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేందుకు ఇప్పటికే డెడ్లైన్ను యాపిల్ పలుమార్లు పొడిగించింది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో పలు కంపెనీల ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తుండటం ప్రారంభించడంతో యాపిల్ ఈ దిశగా చర్యలు చేపట్టింది. దశలవారీగా ఉద్యోగులందరినీ కార్యాలయాలకు రప్పించేలా యాపిల్ కసరత్తు సాగిస్తోంది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు కార్యాలయాలకు హాజరుకావాలని కోరుతుండగా కొ్ద్దినెలల పాటు ఇదే పద్ధతిని కొనసాగించే అవకాశం ఉంది.