హైదరాబాద్, జనవరి 5: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ తన వ్యాపారాన్ని భారీగా విస్తరించబోతున్నది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.3 వేల కోట్లతో 2 వేల పడకలను ఏర్పాటు చేయబోతున్నట్టు అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీతా రెడ్డి తెలిపారు. మెడికల్ టూరిజం భారీగా వృద్ధిచెందుతుండటంతో 2028 నాటికి భారీగా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు ఆమె విశ్లేషించారు. ఇక నుంచి ప్రతియేటా 700 పడకలచొప్పున వచ్చే మూడేండ్లకాలంలో మొత్తంగా 2 వేల పడకలను నెలకొల్ప బోతున్నట్లు తెలిపారు. ప్రస్తు తం అపోలోకు పలు రాష్ర్టాల్లో 70 ఆసుపత్రులు, 10 వేల పడకలు, 400 క్లినిక్స్, 6 వేల ఫార్మసీలు ఉన్నాయి.