ముంబై, ఏప్రిల్ 4: దేశీయ స్టాక్ మార్కెట్లో మరో రికార్డుకి చేరుకున్నాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆర్థిక సేవల రంగ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో వరుస నష్టాలకు బ్రేక్పడినట్లు అయింది. ఆర్బీఐ తన పరపతి సమీక్ష కంటే ముందుగానే పలు బ్యాంకింగ్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. 74,500 నుంచి 73,485 శ్రేణిలో కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 350.81 పాయింట్లు లాభపడి చారిత్రక గరిష్ఠ స్థాయి 74,227.63 వద్ద స్థిరపడింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఆల్టైం హైకీ 22,514.65 పాయింట్లను తాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 80 పాయింట్లు పెరిగినట్లు అయింది. మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్లు లాభాల్లో ముగియగా..ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, ఐటీసీ, రిలయన్స్లు నష్టపోయాయి.