న్యూఢిల్లీ, మార్చి 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా
(ఎంఅండ్ఎం) మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనిశ్ షా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూపు చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న పవన్ గోయెంకా స్థానాన్ని షా భర్తీచేయనున్నారు. రెండేండ్ల క్రితం టాప్ మేనేజ్మెంట్లో కీలక మార్పులు చేసిన మహీంద్రా.. మరోసారి ఇలాంటి మార్పులకు శ్రీకా రం చుట్టింది. ఈ సందర్భం గా మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారాలను సమతుల్యం చేసేందుకు అనిశ్ షా సరైన వ్యక్తని, అతని నాయకత్వంలో గ్రూపు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశాలున్నాయన్నారు. 2015లో గ్రూపు ప్రెసిడెంట్గా చేరిన షా.. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ఎండీ, సీఈవోగా పదొన్నతి పొందారు.