Anand Mahindra : ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 మధ్యంతర బడ్జెట్ను కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. బడ్జెట్పై మనం ఎప్పుడూ అసహజ రీతిలో భారీ ఆశలు పెట్టుకుంటామని, భారీ విధాన మార్పులకు బడ్జెట్ ఒక్కటే వేదిక కాదని, ఇలాంటి మార్పులు ఏడాది పొడవునా ఇతర సందర్భాల్లోనూ ఉంటాయని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
బడ్జెట్ చుట్టూ మనం డ్రామాను కరియేట్ చేస్తుంటామని, కీలక విధాన ప్రకటనలపై అంచనాలు పెంచుతుంటామని తాను చాలా ఏండ్లుగా చెబుతున్నానని ఆనంద్ మహీంద్ర గుర్తుచేశారు. బడ్జెట్లో చక్కటి ఆర్ధిక ప్రణాళికతో ముందుకెళుతున్నారని ప్రశంసలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఆనంద్ మహీంద్ర స్వాగతించారు.
బడ్జెట్లో పలు సానుకూల అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు బడ్జెట్లలో ఉండే జనాకర్షక పధకాలకు చోటు కల్పించకపోవడం ప్రశంసనీయమని అన్నారు. ఈ విధానం మున్ముందు కొనసాగాలని ఆకాంక్షించారు. సౌభాగ్య భారత్ దిశగా ఇక మనం అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు.
Read More :
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్