హైదరాబాద్, ఆగస్టు 26: అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ కోకా-కోలా..తెలంగాణలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు, కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
శీతల పానీయాల రారాజుగా వెలుగొందుతున్న కోకా-కోలాకు ఇప్పటికే హైదరాబాద్లో అతిపెద్ద యూనిట్ ఉన్నది. 1892లో ప్రారంభమైన ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా యూనిట్లు ఉన్నాయి.