హైదరాబాద్, మార్చి 9: అమెరికాకు చెందిన సరుకు రవాణా సేవల సంస్థ ఫెడెక్స్..దేశంలో తన తొలి అడ్వాన్స్ కెపాబిలిటీ కమ్యూనిటీ(ఏసీసీ) సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పబోతున్నది. ఈ ఏడాది రెండో అర్థభాగంలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్తో భారత్లో తన విస్తరణ కార్యకలాపాలను మరింత వేగవంతం విస్తరించడానికి దోహదం చేయనున్నదని పేర్కొంది. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు మరింత వేగవంతంగా సరుకు రవాణ చేయడానికి అవసరమైన టెక్నాలజీ, ఇన్నోవేషన పరంగా చర్యలకు ఈ సెంటర్ కీలకంకానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ఏసీసీ సెంటర్లను నెలకొల్పాలని కంపెనీ నిర్ణయించింది.
వినియోగదారుల కోసం ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. భారత్లో ప్రారంభిస్తున్న తొలి ఏసీసీ చాలా కీలకం. దీంతోసరుకు రవాణా వేగవంతం కావడంతోపాటు మరింత సౌకర్యవంతంగా అందించినట్లు అవుతున్నది.
– రాజ్ సుబ్రమణియమ్, ఫెడెక్స్ ప్రెసిడెంట్, సీఈవో